అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. నేడు ఆయనతో పాటు 11మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఆ రాష్ట్ర చరిత్రలో ఒక మహిళ మంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఆమె దొసాంగ్లు పుల్. అసెంబ్లీ ఎన్నికల్లో హాయులియాంగ్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుత కేబినెట్లో ఆమెకు ఏ శాఖ అప్పగిస్తారో తెలియాల్సి ఉంది.