లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
By Somaraju 83చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 676.69 పాయింట్ల లాభంతో 73,663.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203.30 పాయింట్ల లాభంతో 22,403.85 వద్ద ముగిసింది. మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. మారుతీ, టాటా మోటార్స్, SBI, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.