లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

81చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 22,297కు చేరగా, సెన్సెక్స్ 323 పాయింట్లు పెరిగి 73,318 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.46 వద్ద ప్రారంభమైంది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో అక్కడి స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు గరిష్టాలకు చేరాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్ సూచీలు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్