తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకత సంతరించుకున్న పిఠాపురం నియోజకవర్గంలో పవనోత్సాహం కనిపించింది. ఈ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియ సాగింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి జనసేనాని పవన్కల్యాణ్ పోటీ చేయడంతో పోలింగ్లోనూ ఓటర్లు తమదైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈసారి 86.63శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అదే 2014లో అయితే 79.44శాతం.. 2019లో 80.92శాతమని లెక్కలు చెబుతున్నాయి.