దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 75.71 పాయింట్ల లాభంతో 73,961.31 వద్ద, నిఫ్టీ 42.05 పాయింట్లు లాభపడి 22,530.70 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్ లాభపడగా, దివీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.46 వద్ద ముగిసింది.