మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తోన్న సీఎం జగన్పైకి దుండగులు రాయి విసిరారు. ప్రజల్లోంచి పూలతో పాటు రాయి విసరడంతో సీఎం ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. బస్సు యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేకనే చంద్రబాబు గూండాలతో దాడి చేయించాడని వైసీపీ ఆరోపించింది.