ప్రముఖ తెలుగు డబ్బింగ్, వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం అనారోగ్యంతో కన్నుమూశారు. అడ్వర్టైంజింగ్ రంగంలో సుమారు 40 ఏళ్లకు పైగా ఆయన సేవలందించారు. కొన్ని వందల యాడ్స్కు, కార్పోరేట్ ఫిల్మ్స్కు వాయిస్ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్ కూడా అందించారు. అమితాబ్, సచిన్, మహేశ్ బాబు వంటి బిగ్ సెలబ్రెటీలతో పాటు చాలా మంది బాలీవుడ్ స్టార్ల ప్రకటనలకు వాయిస్ అందించారు. అనంతరాం స్వస్థలం హైదరాబాద్ అయితే ముంబైలో ఉంటున్నారు.