భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఏడాది వయసున్న కుమారుడికి తాను తండ్రి కాదని భావించి ఆ పసికందును హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సుజిత్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఏడాది వయస్సున్న కొడుకు తన బిడ్డ కాదని ఆమెతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం ఆ బాలుడ్ని హత్య చేశాడు. తన బిడ్డను భర్త చంపాడంటూ పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేసింది. దాంతో సుజిత్ను అరెస్ట్ చేశారు.