హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ను ఆంధ్రప్రదేశ్లోనూ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని వెల్లడించారు. త్వరలోనే ఏపీలో కూడా ఆసుపత్రిని నిర్మిస్తే ఇకపై వారు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.