ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషికి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు అతిషిని నిందితురాలిగా గుర్తించి జూన్ 29న హాజరుకావాలని ఆదేశించింది. దీంతో మంత్రి అతిషి మాట్లాడుతూ.. ఆప్ ఎమ్మెల్యేలను వేటాడేందుకు బీజేపీ ప్రయత్నించిందని అతిషి ఆరోపించారు.