సుప్రీంకోర్టు ఇవాళ చరిత్ర సృష్టించింది. గత 75 ఏండ్ల కాలంలో కేవలం 12మంది మహిళా న్యాయవాదులు మాత్రమే సీనియర్ అడ్వకేట్ హోదాను పొందారు. కానీ, ఇవాళ ఒకే రోజు 11 మంది మహిళా న్యాయవాదులకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించింది. వారిలో శోభా గుప్తా, స్వరూపమా, లిజ్ మాథ్యూ, కరుణ, ఉత్తరా బబ్బర్, హరిప్రియ, అర్చన పాఠక్, షిరన్, నప్పినై, జనని, నిషా బాగ్చి ఉన్నారు. ఇవాళ మొత్తం 56మంది లాయర్లు సీనియర్ అడ్వకేట్ హోదా పొందారు.