ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ను పొడిగించాలంటూ వేసిన పిటిషన్ ను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారించాలని కేజ్రీవాల్ వేసిన బెయిల్ పిటిషన్ పై చీఫ్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ దత్తా స్పందిస్తూ… అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.