ప్రధాని మోదీని 'శివలింగంపై తేలు' అంటూ 2018లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో ప్రొసీడింగ్స్పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు ఊరట లభించింది. ఈ కేసు ప్రొసీడింగ్స్పై సుప్రీంకోర్టు మంగళవారం తాత్కాలిక స్టే ఇచ్చింది. పరువునష్టం కేసు కొట్టివేయాలంటూ థరూర్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 29న తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టును థరూర్ ఆశ్రయించారు. సుప్రీం ధర్మాసనం కేసు విచారణ జరిపింది.