హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతున్నది. తాజాగా హర్యానా సీఎం నాయబ్సింగ్ సైనీ నామినేషన్ వేశారు. ఆయన లద్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.