అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం

72చూసినవారు
హుజూర్ నగర్ లో అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగష్టు నెల చివర కల్లా ఎన్ ఎస్ పి కెనాల్, లైనింగ్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విష జ్వరాలు ప్రభలుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపట్టాలని అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన దరఖాస్తుల వివరాలను పరిశీలించారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించారు.

సంబంధిత పోస్ట్