గుర్తు తెలియని వ్యక్తికి ప్రమాదం
గుర్తు తెలియని వ్యక్తికి ప్రమాదం జరిగి కోదాడ ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు శనివారం తెలిపారు. అతనికి సంభందించిన వారు ఎవరైనా గుర్తు పడితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని వైద్యులు తెలిపారు. అతని వద్ద చిరునామా కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న అతనిని స్థానికులు వైద్య శాల కు చేర్చారని తెలిపారు.