అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కార్డెన్ సెర్చ్
జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ మండల పరిధిలోని కొమరబండ లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించిన సోదాల్లో సరైన ధ్రువ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాటన్ సెర్చ్ లో ఐదుగురు ఎస్సైలు 25 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.