సుద్ద ముక్క పై నాగలి పట్టిన రైతు

58చూసినవారు
కోదాడ కు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆదివారం అంగుళం సుద్ద ముక్కపై నాగలి పట్టిన రైతు బొమ్మ ను చెక్కి రైతులకు తనకుఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, సుద్ధ ముక్క లపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కిఅబ్బుర పరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్