వీధి వ్యాపారులు ఫుట్ పాత్ ను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఫుట్ పాత్ ని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించి మాట్లాడారు. జీవనం గడిపేందుకు వ్యాపారాలు చేసుకోవాలి కానీ రోడ్డును ఆక్రమించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దని సూచించారు. నడకదారిని ఆక్రమించడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.