రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

68చూసినవారు
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నాగార్జున సాగర్ సమీపంలోని బెట్టెల్ తండా వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని మహేంద్ర జీపు ఢీకొట్టిన ఘటనలో బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాదు హాస్పటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో భర్త మృతి చెందాడు. మృతుడు తిరుమలగిరి (సాగర్) మండలం నెల్లికల్ కు చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్