తెలంగాణను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: జూపల్లి

63చూసినవారు
తెలంగాణను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: జూపల్లి
తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాదులోని ది ప్లాజా హోటల్ నుండి అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమైన నాగార్జునసాగర్ హిల్ కాలనీ వరకు 200 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక ఎండి ప్రకాష్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్