కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం.. వాహనాలు ధ్వంసం

17043చూసినవారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. ఘటనలో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే ఈ యాక్సిడెంట్ లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బుధవారం నుండి బస్సు యాత్ర ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్