గుండెపోటుతో బీజేపీ ఎంపీ కన్నుమూత

90567చూసినవారు
గుండెపోటుతో బీజేపీ ఎంపీ కన్నుమూత
యూపీలోని హత్రాస్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ రాజ్‌వీర్ సింగ్ దిలేర్ (66) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దిలేర్ 2017లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఎంపీగా గెలిచాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్