లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. బిజెపి నుంచి శానంపూడి సైదిరెడ్డి తరఫున పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిలు విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, రచ్చ సుభద్రారెడ్డి, లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్లు వేశారు.