సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి 120 వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం నుంచి గ్రామ పురవీధుల్లో పురాతనమైన రథంపై స్వామి వార్ల ఉత్సవ విగ్రహా లను ఉంచి ఊరేగించారు. అనంతరం హోలీ వేడుకలను జరుపుకున్నారు. డీజే పాటలకు మహిళలు, యువత రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు.