ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. బుధవారం కూడా దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని రైతులు ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై కందకాలు తవ్వారు. దిల్లీలో 144 సెక్షన్ అమలు, రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.