మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. స్విమ్మింగ్ చేసిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో ఇద్దరు స్నేహితురాళ్ళు కత్తులతో దాడి చేసుకున్నారు. వివరాల ప్రకారం.. 18 ఏళ్ల యువతి ఒక చెరువులో ఈత కొట్టగా మరో స్నేహితురాలు ఆమెను వీడియో తీసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం ఆ యువతికి తెలిసి ఘర్షణకు దిగింది. దీంతో ఇద్దరూ కత్తులతో ఒకరినొకరు పొడుచుకుని గాయపడ్డారు. అనంతరం మధోటల్ పిఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు.