టీ20 వరల్డ్ కప్లో భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్తో బుధవారం ఆడనుంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్, కోహ్లి ఓపెనింగ్ చేయనున్నారు. న్యూయార్క్లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో స్లో పిచ్ కావడంతో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను బెంచ్కు పరిమితం చేశారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో నలుగురు ఆల్రౌండర్లు హార్దిక్, జడేజా, అక్షర్, శివమ్ దూబే తుది జట్టులోకి తీసుకుంది.