ఇండోనేషియా ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే భారత క్రీడాకారిణి పీవీ సింధు ఓటమి పాలైంది. చైనీస్ తైపీ ప్లేయర్ సు వెన్చి చేతిలో 15-21, 21-15, 14-21తేడాతో పరాజయం పాలయ్యారు. పారిస్ ఒలింపిక్స్ 2024కి ముందు సింధు వరుస ఓటములపై భారత అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన మలేషియా మాస్టర్స్లో సింధు రన్నరప్గా నిలిచారు.