ముంబయి ఉగ్రదాడి కేసులో నిందితుడిగా ఉన్న తహవ్వుర్ రాణాను అమెరికా గురువారం భారత్కు అప్పగించనుంది. దాడి తర్వాత పారిపోతూ ఎఫ్బీఐకు చిక్కడంతో అమెరికా అతడిని ప్రత్యేక కోర్టులో ఉంచింది. ఈ క్రమంలో రాణాను భారత్ కు అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రత్యేక విమానంలో అతడిని భారత్కు తీసుకురానున్నారు. కాగా గురువారం మధ్యాహ్నం రాణాను భారత్కు అప్పగించే అవకాశం ఉంది.