భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల(M) జీపీ పల్లిలో ఓ టీచర్ను విద్యార్థుల తల్లిదండ్రులు నిర్బంధించారు. ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం కృష్ణను గదిలో బంధించారు. మద్యం తాగి వచ్చి పిల్లలను కృష్ణ కొడుతున్నారని.. అందుకే నిర్బందించామని తల్లిదండ్రులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈవో.. మరో టీచర్ను పాఠశాలకు పంపారు. ఈ ఘటనపై మండల విద్యాశాఖ అధికారి విచారణ జరుపుతున్నారు.