గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. "బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో చీకటి జీవోలు తెచ్చింది. రాష్ట్రాన్ని బంగారు పళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోంది. 2018 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేదు." అని మండిపడ్డారు.