ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి మృతి

71చూసినవారు
ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి మృతి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. 5 రోజుల క్రితం అదృశ్యమైన ఆయన మృతదేహం సముద్రంలో లభ్యమైంది. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన దివంగత బీజేపీ నాయకుడు అరటి కృష్ణ, ఉషారాణి దంపతుల కుమారుడు అరవింద్‌ (30) ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి సిడ్నీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డారు. ఏడాదిన్నర క్రితమే సిరివెన్నెలతో వివాహమైంది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్