ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్ హైవే సమీపంలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. 17 మంది ప్రయాణికులతో టెంపో ట్రావెలర్ అదుపు తప్పి బాగా లోతైన లోయలో పడిపోయింది. ఎస్డిఆర్ఎఫ్, పోలీసు బృందాలు అక్కడకు చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరిని కాపాడారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి పంపించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.