భగవద్గీత శ్లోకం పాడిన పదివేల మంది (వీడియో)

6780చూసినవారు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లెన్ ఈస్ట్ సెంటర్‌లో సుమారు పదివేల మంది భగవద్గీత పారాయణం చేశారు. యోగా సంగీత, ఎస్జీఎస్ గీతా ఫౌండేషన్ సంయుక్తంగా భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులతోపాటు పెద్దలు కూడా ఎంతో భక్తితో గీతా శ్లోకాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్