ఆదిలాబాద్ లో ఉద్రిక్తత.. రైతులపై లాఠీ ఛార్జ్ (వీడియో)

85చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు. స్టాక్ లేదని చెప్పడంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు జీలుగ, జనుము విత్తనాల కోసం జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయం కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. 2,500 బస్తాల విత్తనాలు అవసరం ఉండగా 1000 బస్తాలే అందజేశారని మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్