మహారాష్ట్రలోని శంభాజీ నగర్లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నాగ్పూర్లో నిరసన అనంతరం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. రెండు గ్రూపుల మధ్య జరిగిన భారీ ఘర్షణలో 15 మంది పోలీసులు సహా దాదాపు 20 మంది గాయపడ్డారు. దీంతో నాగ్పుర్ నగర పరిధిలోని కొత్వాలి, గణేశ్పేట్, లకడ్గంజ్ లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పోలీసు అంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.