తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు అవాంతరం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో టీచర్లు తెలుగు ప్రశ్నపత్రానికి బదులు హిందీ పేపర్ను విద్యార్థులకు ఇచ్చారు. వెంటనే అధికారులు జరిగిన తప్పిదాన్ని గుర్తించి, 2 గంటల తర్వాత హిందీ పేపర్ను మార్చి తెలుగు పేపర్ను అందించారు. దీనిపై జిల్లా కలెక్టర్ దీపక్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.