ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ - దంతేవాడ జిల్లా సరహిద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన మావోయిస్టుల్లో 18 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఈ 26 మందిలో 18 మందిని గుర్తించామని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. మరణించిన వారిలో 9 మంది పీపీసీఎం, ఒకరు డీవీసీఎం కమాండర్, 8 మంది ఏసీఎం కేడర్ ఉన్నట్లు ఐజీ తెలిపారు.