ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన భారీ ట్రక్కు, బైక్పై వెళ్తున్న తల్లీకొడుకులను ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడీయో నెట్టింట వైరల్ గా మారింది.