పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆదివారం పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను, క్షతగాత్రులను బన్నూలోని జాయింట్ మిలిటరీ దవాఖానకు విమానంలో తరలించారు. దాడుల అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని సెర్చింగ్ చేస్తున్నాయి.