TG: ఈదురుగాలుల బీభత్సం.. ఏడుగురు మృతి (వీడియో)

33637చూసినవారు
తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సానికి ఏడుగురు మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు(M) ఇంద్రకల్లో కోళ్ల ఫారం గోడ కూలి నలుగురు కార్మికులు మరణించారు. అదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు లక్ష్మణ్ (12) చనిపోయారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడటంతో నాగిరెడ్డి, రామ్ రెడ్డి మృతి చెందారు.

సంబంధిత పోస్ట్