తెలంగాణలో సాంకేతిక కారణాల వల్ల అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుల బస్పాస్ల అప్లికేషన్లను ఆన్లైన్లో స్వీకరించడం లేదని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జూన్ 26వ తేదీ నుంచి సమీపంలోని బస్పాస్ సెంటర్లకు నేరుగా వెళ్లి పాస్లు తీసుకోవాలని సూచించింది. జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్ కార్డు, పాత బస్పాస్ చూపించి కొత్తవి తీసుకోవాలని కోరింది.