ఆ బాధ్యత కలెక్టర్లదే: మంత్రి తుమ్మల

81చూసినవారు
ఆ బాధ్యత కలెక్టర్లదే: మంత్రి తుమ్మల
ఎరువులు, విత్తనాలు రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సెక్రటేరియట్ లో పత్తి, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ మేరకు నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విత్తనాల సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్