బస్సు లోయలో పడి.. ముగ్గురు మృతి

63చూసినవారు
బస్సు లోయలో పడి.. ముగ్గురు మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గంగోత్రి జాతీయ హైవేపై ఉన్న గంగనది వద్ద బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్