మహారాష్ట్రలోని ముంబయి నార్త్ వెస్ట్ లోక్ సభ స్థానం నుంచి ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ తరఫున రవీంద్ర దత్తారామ్ వైకర్ పోటీ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ) నుంచి అన్మోల్ కీర్తికర్ నిలబడ్డారు. వీరి మధ్య ఆద్యంతం గెలుపు ఊగిసలాడింది. చివరకు 48 ఓట్ల తేడాతో రవీంద్ర విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 4,52,644 ఓట్లు రాగా.. ప్రత్యర్థి అన్మోల్కు 4,52,596 ఓట్లు పోలయ్యాయి.