యూపీలోని కాన్పూర్లో ఆదివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. బాగ్ చౌరాహా సమీపంలో పలువురి కార్లను ఓ కారు డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో భోలా తివారీ అనే న్యాయవాది ఆ కారును అడ్డుకున్నారు. కారుకు ఎదురుగా నిల్చుకుని డ్రైవర్ను ప్రమాదంపై నిలదీశారు. అయితే కారుడ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కారుకు ఎదురుగా నిల్చున్న తివారీని ఢీకొట్టాడు. కారుపై నుంచి వెళ్లడంతో తివారీ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు.