బీజేపీ సీనియర్ నాయకురాలు, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ లోక్సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి గెలుపొందారు. గురువారం పాత పార్లమెంట్ భవనంలో జరిగిన NDA సమావేశానికి ఆమె హాజరయ్యారు. మొదటిసారిగా పార్లమెంట్కు వచ్చిన మీకు అమ్మ గుర్తుకొస్తుందా అని ఓ రిపోర్టర్ అడగగా.. ప్రజలు తనను నమ్మి పార్లమెంట్కు పంపారని వారికి ఏదైనా మంచి చేయాలనే తన సంకల్పమని బన్సూరి స్వరాజ్ బదులిచ్చారు.