జగన్‌కు కేంద్రం రక్షణ కల్పించాలి.. మోదీ, అమిత్‌షాలకు మిథున్‌రెడ్డి లేఖ

80చూసినవారు
జగన్‌కు కేంద్రం రక్షణ కల్పించాలి.. మోదీ, అమిత్‌షాలకు మిథున్‌రెడ్డి లేఖ
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ విధానాలతో జగన్ ప్రాణానికి ముప్పు ఉందన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి అని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్