రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థులకు పదేళ్ల పాటు సీట్లు కల్పించే గడువు జూన్ 2తో ముగియనుంది. దీంతో 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఏపీ కోటాకు(15%) బ్రేక్ పడనుంది. సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే ఇవ్వనున్నారు. ఈ ఏడాది నోటిఫికేషన్లన్నీ జూన్కు ముందే రావడంతో కామన్ అడ్మిషన్లకు ఛాన్సుంది. ఈసారి టీఎస్ ఎప్సెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు ఏపీ స్టూడెంట్స్ నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి.